ప్రజలు చివరి రోజుల్లో కాశీలోనే ఉంటారని సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్ చేశారు. ఆయన కాశీ పర్యటనకు రావడం చాలా మంచిదని, ఆయన ఇక్కడ ఒక్క నెల మాత్రమే కాదు.. రెండు మూడు నెలలైనా ఇక్కడే ఉండొచ్చని అన్నారు. ఈ కొద్ది రోజులే కాదని, చివరి రోజుల్లో ప్రజలు ఇక్కడే ఉండిపోతారని అఖిలేశ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రస్తుతం చివరి రోజుల్లో ఉన్నట్టుందని అన్నారు. బీజేపీ ప్రతి ఒక్కరి ముందు అబద్ధాలాడుతోందని, కానీ దేవుడి ముందు అబద్ధాలు చెప్పకూడదని ఆయన అన్నారు. ఇటావా సిటీలో బీజేపీ ప్రభుత్వం సరైన అభివృద్ధి చేయలేదని, ఒకవేళ బాగా అభివృద్ధి చేసి ఉంటే ఇటావా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగాల్సిందని అన్నారు.
#WATCH | "It's good that the programmes are one-month long (for Kashi Vishwanath in Varanasi). They (PM Modi & other BJP leaders) should stay there for not only one, two or three months, people also spend their last moments in Banaras," says SP Chief Akhilesh Yadav, in Saifai. pic.twitter.com/Sqs1AE2hoT
— ANI UP (@ANINewsUP) December 13, 2021