వీర సైనికులకు వీర వణక్కం 

వీర సైనికులకు వీర వణక్కం 

తమిళనాడులోని కూనూరులో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య మధులికా రావత్ తో పాటు మరో 11 మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి భౌతిక కాయాలను గురువారం మధ్యామ్నం మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలూర్ ఎయిర్ బేస్ కు  తరలించారు. ఈ క్రమంలో రావత్ తోపాటు మిగిలిన అధికారుల మృత దేహాలతో కూడిన అంబులెన్స్ లు వెళ్తున్న సమయంలో.. దారిలో స్థానిక ప్రజలు పూలతో నివాళి అర్పించారు. వీర వణక్కం (వీర వందనం), భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ దేశ సేవలో ప్రాణాలు విడిచిన సైనికాధికారులకు వీడ్కోలు పలికారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతోంది.