
న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు రూ. 2 లక్షల కోట్లు ఆదా అవుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఆదాయపు పన్నులో ఇచ్చిన రాయితీలతో పాటు ఈ జీఎస్టీ మార్పులు ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాయని అన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీలో మార్పులు రానున్నాయని, కొత్త విధానంలో, 12 శాతం 28 శాతం స్లాబ్లను తొలగించి, రెండు కొత్త స్లాబ్లు (5శాతం, 18శాతం) ప్రవేశపెట్టామని చెప్పారు. 99 శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ స్లాబ్లోకి వచ్చాయని, దీని వల్ల మధ్యతరగతి పేదలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
జీఎస్టీ మండలి తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు తోడ్పడుతుందన్నారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 65 లక్షల నుంచి 1.51 కోట్లకు పెరిగిందని మంత్రి నిర్మల తెలిపారు.