వేములవాడ కోడెల మృత్యువాతపై ..జంతు సంరక్షణ బోర్డులో పిటిషన్

వేములవాడ కోడెల మృత్యువాతపై ..జంతు సంరక్షణ బోర్డులో పిటిషన్

పద్మారావు నగర్, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృత్యువాతపై హర్యానాలోని జాతీయ జంతు సంరక్షణ బోర్డులో పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాది రామారావు ఇమ్మానేని తెలిపారు. ఆలయంలో కోడెలు మృత్యువాత పడ్డాయని, గల్లంతు అయ్యాయని, గోశాలలో కోడెలు కిక్కిరిసిపోయి ఊపిరిఆడక మృతి చెందుతున్నాయని పిటిషన్​లో పేర్కొన్నారు.

కిక్కిరిసిన గోశాలలు కోడెలకు మరణ శాసనం లిఖిస్తున్నా ఎండోమెంట్ శాఖ పట్టించుకోవడం లేదని ,అధికారుల నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నట్టు చెప్పారు. కోడెల లెక్క ఆడిట్, జీవుల పునరావాసం, గోశాలల నిర్మాణం, అక్రమ తరలింపుపై చర్యలు చేపట్టాలని ఆయన జాతీయజంతు సంరక్షణ బోర్డును కోరారు.