
కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు దిగి వస్తుంటే.. కేంద్రం మాత్రం భారత్లో రేట్లు పెంచుతుంది. వాహానదారులందరూ.. క్రూడ్ ఆయిల్ ధర తగ్గడంతో.. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గుతాయని భావించారు. కానీ.. ఆ ఆశలను ఆవిరి చేస్తూ.. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ సుంకం బాగా పెంచింది. దాంతో పెట్రోల్, డీజిల్పై అదనంగా రూ. 3 భారం పడుతుంది. గత నెల రోజుల నుంచి తగ్గతూ వచ్చిన ఆయిల్ ధరలు.. నెల రోజుల్లో దాదాపు రూ. 5 వరకు తగ్గాయి. అయితే ఈ రోజు ఎక్సైజ్ డ్యూటీ పెరగడంతో.. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 వరకు పెరిగే అవకాశముంది.
ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 74.41లకు, డీజిల్ రూ. 68.60లకు లభిస్తున్నాయి. పెరిగిన ఎక్సైజ్ సుంకం వల్ల వీటిపై మరో మూడు రూపాయలు పెరగవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంపై వాహానదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
For More News..