పెరిగిన పెట్రోల్ రేటు.. హైదరాబాద్‌లో కొత్త ధర ఎంతంటే?

పెరిగిన పెట్రోల్ రేటు.. హైదరాబాద్‌లో కొత్త ధర ఎంతంటే?

దేశంలో మరోసారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్‌‌కు 25 పైసలు, డీజిల్ ధర 28 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. గడిచిన 22 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలను ఇవాళ ఆయిల్ కంపెనీలు పెంచాయి. డీజిల్ ధర మాత్రం వారంలో రోజుల్లో నాలుగో సారి పెరిగాయి. ఈ పెంపుతో దేశ రాజధానిలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.39, డీజిల్ రేటు రూ.89.57కు చేరాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.48కి, డీజిల్ రేటు రూ.97.74కు పెరిగాయి.

సిటీల వారీగా పెరిగిన రేట్లు..

సిటీ                  పెట్రోల్          డీజిల్

హైదరాబాద్     ₹ 105.48         ₹ 97.74

ఢిల్లీ                    ₹ 101.39         ₹ 89.57

ముంబై                ₹ 107.47        ₹ 97.21

చెన్నై                    ₹ 99.15         ₹ 94.17

కోల్‌కతా                 ₹ 101.87       ₹ 92.67

బెంగళూరు           ₹ 104.92        ₹ 95.06

మరిన్ని వార్తల కోసం:

పంతం నెగ్గించుకున్న కెప్టెన్.. సిద్ధూ రాజీనామా

పాక్ సాయంతో భారత్‌లోకి టెర్రరిస్టు.. ఆర్మీ ఎదుట లొంగుబాటు

సిద్ధూ ఎలాంటోడో ముందే చెప్పా కదా..