- ఈ సెంటర్తో 35 వేల మందికి ప్రయోజనం
హైదరాబాద్, వెలుగు : అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ఇండియా ఇన్ కమ్యూనిటీస్ ప్రోగ్రామ్ సహకారంతో పునరుద్ధరించిన షాబాద్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆరోగ్య కేంద్రం చుట్టు పక్కల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలోని 35 గ్రామాలలోని 35 వేల మంది రోగులకు ఈ కేంద్రం ద్వారా ప్రయోజనం చేకూరనుందన్నారు. కార్యక్రమంలో ఏడబ్ల్యుఎస్ డేటా సెంటర్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్లర్ పాల్గొన్నారు.