ముంబై: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్వాలా లిమిటెడ్ షేర్లు మంగళవారం (నవంబర్ 18) స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 109తో పోలిస్తే 42 శాతం పైగా ప్రీమియంతో ముగిశాయి. ఈ స్టాక్ బీఎస్ఈలో ఇష్యూ ధర నుంచి 31.28 శాతం పెరిగి రూ. 143.10 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
ఇంట్రాడేలో రూ. 162.05 గరిష్ట స్థాయికి చేరి, చివరకు 42.38 శాతం లాభంతో రూ. 155.20 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో రూ. 145 వద్ద లిస్ట్ అయింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 44,382.43 కోట్లుగా ఉంది.
