జనవరి 2024లో ప్రారంభం కానున్న అయోధ్యలోని రామ మందిరం లోపలి చెక్కిన చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పంచుకుంది. ట్రస్ట్ వారి అధికారిక Xఖాతాలో పంచుకున్న ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ చిత్రాల్లో కళాకారులు రామమందిరం లోపల స్తంభాలపై చెక్కిన శిల్పాలను చూడవచ్చు.
Carvings inside Shri Ram Janmabhoomi Mandir.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 28, 2023
श्री राम जन्मभूमि मंदिर के भीतर नक्काशी का कार्य pic.twitter.com/sFfUbWLBHv
పలు నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్ లో నిర్మితమవుతోన్న ఈ రామమందిర నిర్మాణంలో రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన రాళ్లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు నిర్మాణంలో ఉన్న రామమందిరం వీడియోను ట్రస్టు షేర్ చేసింది. "500 ఏళ్ల పోరాటానికి పరాకాష్ట" అనే క్యాప్షన్తో కూడిన ఈ 30 సెకన్ల నిడివి గల వీడియోలో ఆలయ నిర్మాణాన్ని స్పష్టంగా చూపించారు.
Also Read :- మండుతున్న ఉల్లి ధరలు
ఈ చిన్న క్లిప్లో బంగారు తలుపులలో ఒకటైన గర్భగుడి, ఆలయ స్తంభాలు, గోడలపై చెక్కడం కూడా చూపబడింది. వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి తాను హాజరవుతానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే తెలిపారు.
500 वर्षों के संघर्ष की परिणति pic.twitter.com/z5OTXivUFL
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 26, 2023