
జీపీఆర్ఎస్ అమర్చిన పావురం కలకలం రేపింది. ఏపీలోని అల్లూరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జాలర్ల చేతికి ఒ జీపీఆర్ఎస్ అమర్చిన పావురం చిక్కింది. ఆ పావురాన్ని ఒక గద్ద పొడుస్తుండగా దాన్ని కాపాడారు. అయితే పక్షి కాలుకు జీపీఆర్ఎస్ ట్రాకర్ ను గుర్తించి జాలర్లు భయందోళనలకు గురైయ్యారు. పావురం ఎక్కడ నుండి వచ్చిందనే అనుమానాలు వారిలో వ్యక్తం అవుతున్నాయి. ఇది మావోయిస్టుల పనా లేక తీవ్రవాదుల కుట్ర, ఆకతాయిలు చేష్ఠలా అనే అనుమానంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆ పావురాన్ని జాలర్లు ఏటపాక పోలీసులకు అప్పగించారు. జీపీఆర్ఎస్ తో ఉన్నా ఈ పావురం ఎక్కడ నుంచి వచ్చిందోనని పోలీసులు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.