బ్రెస్ట్ క్యాన్సర్ పై పింక్ పవర్ రన్ .. సెప్టెంబర్ 28న నెక్లెస్ రోడ్ లో నిర్వహిస్తాం

బ్రెస్ట్ క్యాన్సర్  పై పింక్ పవర్ రన్ .. సెప్టెంబర్ 28న నెక్లెస్ రోడ్ లో నిర్వహిస్తాం
  • మెయిల్​ ఫౌండేషన్​ ఫౌండర్ ​మేఘా సుధారెడ్డి 

మాదాపూర్, వెలుగు: మహిళల్లో బ్రెస్ట్​ క్యాన్సర్​పై అవగాహన కల్పించేందుకు మేఘా ఇంజనీరింగ్​ఇండస్ట్రీస్​ లిమిటెడ్ ఫౌండేషన్ ​ఆధ్వర్యంలో పింక్​పవర్ రన్​ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఫౌండర్​మేఘా సుధారెడ్డి తెలిపారు. మాదాపూర్​లోని ఓ హోటల్​లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ​ఈ కార్యక్రమానికి మిస్​వరల్డ్–2025 ఓపల్​సుచాత, మిస్​ఏసియా–2025 కృష్ణ గ్రావిడ్జ్​చీఫ్​గెస్ట్​లుగా హాజరయ్యారు. సుధారెడ్డి మాట్లాడుతూ.. రెండేండ్లుగా మెయిల్​ఫౌండేషన్​ఆధ్వర్యంలో మహిళలకు బ్రెస్ట్​ క్యాన్సర్​పై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

స్టార్టింగ్ స్టేజ్​లో గుర్తిస్తే క్యాన్సర్ ను క్యూర్ చేయొచ్చని చెప్పారు. సెప్టెంబర్ 28 నెక్లెస్​ రోడ్​లో 2కె, 5కె,10కె పింక్ పవర్ రన్ ఉంటుందని, గ్రామీణ మహిళలు కూడా వస్తారని తెలిపారు. మిస్​వరల్డ్ ఓపల్ సుచాత మాట్లాడుతూ.. తనకు 16 ఏండ్లప్పడు బ్రెస్ట్​క్యాన్సర్​వచ్చిందన్నారు. స్టార్టింగ్​స్టేజ్​లోనే గుర్తించడం వల్ల వ్యాధి నుంచి బయటపడ్డానని తెలిపారు. ఎలాంటి వ్యాధినైనా ముందుగా గుర్తిండమే ముఖ్యమని, అందుకే ఓపల్ ఫర్ హర్​సంస్థ ద్వారా అవేర్​నెస్​కల్పిస్తున్నానని చెప్పారు. మిస్ ఏసియా కృష్ణ గ్రావిడ్జ్ మాట్లాడుతూ.. బ్రెస్ట్​ క్యాన్సర్​ను ఎర్లీగా డిటెక్ట్​చేస్తే బయట పడొచ్చని సూచించారు.