పగిలిన పైప్​ లైన్​... రోడ్డుపై వరద ప్రవాహం

పగిలిన పైప్​ లైన్​... రోడ్డుపై వరద ప్రవాహం

కొత్తగూడెం టౌన్​లోని పోస్టాఫీస్​ సెంటర్​ నుంచి మున్సిపాలిటీ సింగరేణి హెడ్డాఫీస్​వెళ్లే దారిలో ఆదివారం మెయిన్ ​పైప్​లైన్​పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీళ్లు ఎగిసిపడడంతో రోడ్డంతా జలమయమైంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  గంట పాటు నీళ్లన్నీ వృథాగా పోయాయి. చివరకు సప్లై ఆఫ్​ చేసిన సింగరేణి సిబ్బంది పైపులైన్​ రిపేర్​చేసే పనిలో పడ్డారు.                                                                                        –  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు