- 2028 నాటికి చేరుకుంటామన్న పిరమల్ ఫైనాన్స్
- బంగారం లోన్ల విభాగంలోకీ వస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎన్బీఎఫ్సీ పిరమల్ ఫైనాన్స్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువను రూ.1.5 లక్షల కోట్లకు చేర్చాలని టార్గెట్గా పెట్టుకుంది. తెలంగాణలో విస్తరిస్తామని ప్రకటించింది. హోం లోన్లు, ఎంఎస్ఎంఈ లోన్లకు తెలంగాణ ముఖ్యమైన మార్కెట్ అని, ఇక్కడ 29 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపింది.
కంపెనీ రిటైల్ లెండింగ్ సీఈఓ జగదీప్ మల్లారెడ్డి హైదరాబాద్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘‘మా రిటైల్ ఏయూఎం నాలుగు సంవత్సరాలలో 3.5 రెట్లు పెరిగి రూ.75 వేల కోట్లు దాటింది.
2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని రూ.లక్ష కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పండుగ సీజన్లో రిటైల్ లోన్లు 45 శాతం పెరిగాయి. చిన్న పట్టణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మా వృద్ధిని పెంచుతున్నాయి.
త్వరలో బంగారం లోన్ల విభాగంలోకి కూడా వస్తాం. 2026 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ నాటికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఏయూఎం రూ.91,477 కోట్లకు చేరింది. క్రెడిట్ హిస్టరీ లేని వారికి కూడా అప్పులు ఇస్తున్నాం. ఇందుకోసం ఏఐ, ఎంఎల్ వంటి టెక్నాలజీలను వాడుతున్నాం”అని ఆయన వివరించారు.
