గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్ మండల, కాజీపేట సర్కిల్ ప్రాంతాల్లోని తహసీల్దార్ ఆఫీసుల గోడలపై మొక్కలు, చెట్లు పెరిగాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, అక్కడకు వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏండ్ల కింద నిర్మించిన ఈ భవనాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇలా మొక్కలు, చెట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని ఎలాంటి ప్రమాదం జరుగకముందే చర్యలు తీసుకోవాలన్ని ప్రజలు కోరుతున్నారు. - కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు
