
- రాజ్భవన్ రోడ్డులో ప్రయోగాత్మకంగా అమలు
- సక్సెస్ అయితే సిటీ అంతటా విస్తరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఉత్పత్తి అవుతున్న చెత్తలోని ప్లాస్టిక్ నుంచి టైల్స్ తయారు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీటిని గ్రేటర్ లోని ఫుట్ పాత్లపై ఏర్పాటు చేయాలని కమిషనర్కర్ణన్ప్లాన్చేస్తున్నారు. ఈ తరహాలో ఫుట్పాత్పై టైల్స్ను ఇప్పటికే మైసూర్ లో వాడుతున్నారు. చెత్తతో ప్లాస్టిక్టైల్స్తయారు చేసి ఫుట్పాత్ లపై వాడడం వల్ల బల్దియాపై ఆర్థిక భారం తగ్గుతుందని, అలాగే, సర్వీసు కూడా ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
రోజూ 8 వేల టన్నుల చెత్త
నగరంలో ప్రస్తుతం రోజూ 8 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో 30 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. అయితే, జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆవరణలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ లో ప్లాస్టిక్ ను రీ సైక్లింగ్ చేసి దాంతో పలు నమునాలతో ప్లాస్టిక్ టైల్స్ తయారు చేయాలని నిర్ణయించారు. దీనిద్వారా ఖర్చు తగ్గడంతో పాటు ప్లాస్టిక్ కూడా పేరుకుపోకుండా ఉంటుందని భావిస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద..
రాజ్ భవన్ రోడ్డులో కిలోమీటర్మేర ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ టైల్స్ గానీ, ఫ్లోరింగ్ గానీ వేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. నాలుగేండ్ల కింద గచ్చిబౌలిలోని పెట్స్ పార్కు వద్ద గేట్ ముందు ఇదే తరహాలో ప్లాస్టిక్ టైల్స్ వేసిన అధికారులు ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్కర్ణన్దీన్ని ఇప్పుడు పక్కాగా, పర్మినెంట్గా అమలు చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద రాజ్ భవర్ రోడ్డులో వేసి తర్వాత దశల వారీ ప్లాస్టిక్ టైల్స్ ఉత్పత్తిని బట్టి మిగతా ప్రాంతాల్లోకి విస్తరించాలని చూస్తున్నారు.