
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావలసిన సబ్సిడీలను సకాలంలో విడుదల చేయించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ కోరారు. మంగళవారం హైదరాబాద్లో జిల్లా సమస్యలపై మంత్రిని కలిశారు. జగన్ మాట్లాడుతూ.. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రావాల్సిన సబ్సిడీలు, విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్లను విడుదల చేయించాలని కోరినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించనట్లు వెల్లడించారు.