
- మిగిలిన ప్లాట్లు వేలం వేస్తే అడ్డుకుంటాం
- కామారెడ్డి ధరణిలో ప్లాట్లు కొన్న యజమానుల మీటింగ్
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డిలో ప్రభుత్వం వేలం ద్వారా అమ్మిన ధరణి వెంచర్లో ప్రభుత్వం వెంటనే సౌకర్యాలు కల్పించాలని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ధరణి వెంచర్లో స్థలాలు, ఇండ్లు కొనుగోలు చేసిన బాధితుల మీటింగ్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. 2022లో 4 దశల్లో ప్రభుత్వం543 ఓపెన్ స్థలాలు, వివిధ దశల్లో ఉన్న ఇండ్లను ప్రభుత్వం వేలం వేసిందన్నారు. వీటిలో 357 ఓపెన్ ప్లాట్లు, ఇండ్లను గవర్నమెంట్ ఎంప్లాయిస్, రిటైర్డు ఎంప్లాయిస్, సాధారణ ప్రజలు కొనుగోలు చేశారన్నారు.
వెంచర్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అన్ని సౌకర్యాలను 6 నెలల్లో కల్పిస్తామని అప్పటి కలెక్టర్, అధికారులు ప్లకార్డులు, హోర్డింగ్ల ద్వారా ప్రచారం చేశారన్నారు. బ్యాంక్ లోన్లు తీసుకొని కొనుగోలు చేశామన్నారు. 3 ఏండ్లు దగ్గరకు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తాగునీరు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ సౌకర్యం కల్పించలేదన్నారు. ఇండ్లు కొనుగోలు చేసిన వారు వాటిలో నివాసం ఉండేలా రిపేర్లు చేయించుకున్నారన్నారు. వసతులు లేక ఉండలేకపోతున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే సౌకర్యాలు కల్పించాలని, లేనట్లయితే మిగిలి ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల వేలం వేయాలని చూస్తే తాము అడ్డుకుంటామన్నారు. ఇందులో ప్రతినిధులు రాజనర్సింహారెడ్డి, జశ్వంత్రావు, నరాల వెంకట్రెడ్డి, కైలాస్ రాజేశ్వర్రావు, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.