
- పీఎం కేర్స్ ట్రస్టీగా రతన్ టాటా
- కరియ ముండా, కేటీ థామస్ కూడా ఎన్నిక
న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను నియమించారు. ఆయనతో పాటు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, మాజీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాను కూడా ఎన్నుకున్నట్టు పీఎంఓ ప్రకటన రిలీజ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన పీఎం కేర్స్ మీటింగ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కొత్తగా ఎన్నికైన ట్రస్టీలు కూడా హాజరయ్యారు. మాజీ కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మహర్షి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి, ఇండికార్ప్స్ అండ్ పిరమల్ ఫౌండేషన్ మాజీ సీఈఓ, టెక్ఫర్ ఇండియా కో–ఫౌండర్ ఆనంద్షాలు పీఎం కేర్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా నామినేట్ అయ్యారు. మోడీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఎంఓ తెలిపింది.
‘‘పీఎం కేర్స్కు నిధులు అందజేస్తున్న ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు పీఎం కేర్స్ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పీఎం కేర్ చేసిన సేవా కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చించారు. 4,345 మంది చిన్నారులకు సాయం ఈ స్కీం కిందే సేవలందిస్తున్నారు. మరింత సమర్థవంతంగా సాయం చేసేందుకు ట్రస్టీలు, సభ్యులతో ప్రధాని మోడీ చర్చించారు.
పీఎం కేర్స్కు కొత్తగా ఎన్నికైన ట్రస్టీలు, అడ్వైజరీ బోర్డు సభ్యులకు అభినందనలు తెలిపారు..”అని పీఎంవో పేర్కొంది. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి పీఎం కేర్స్ను ఏర్పాటు చేశారు. 2020–21 ఫైనాన్షియల్ ఇయర్లో దాని కార్పస్ మూడు రెట్లు పెరిగి రూ.10,990 కోట్లకు చేరుకుంది. తాజా ఆడిట్ ప్రకారం.. వలస కార్మికుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు, కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం రూ.1,392కోట్లు ఖర్చు చేశారు.