సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది

సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది

భద్రతా బలగాలకు భారతీయుల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు ప్రధాని మోడీ. శనివారం ఆయన..రాజస్థాన్‌లోని జైసల్మెర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మోడీతో పాటు త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణె ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..మంచు కొండలు, ఎడారిలో నివసిస్తోన్న సైనికులతో కలసి తాను దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.

వీర మరణం చెందిన సైనికులకు నివాళులర్పిస్తున్నానని తెలిపిన  ప్రధాని మోడీ.. సైనికుల మధ్యకు వచ్చినప్పుడు తనకు అసలైన దీపావళిని జరుపుకుంటున్నట్లు అనిపిస్తుందన్నారు.  సైనికులు ఉత్సాహంగా ఉంటేనే దేశ ప్రజలు ఉత్సాహంగా ఉంటారని.. దేశాన్ని రక్షించే సైనికులను చూసి యావత్ భారతావని గర్వపడుతోందన్నారు. ఆక్రమణదారులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే ధైర్యం సైనికులను ఉందని చెప్పారు. ఉగ్రవాదులను భారత్ అంతమొందిస్తోందని చెప్పారు. దేశ భద్రత విషయంలో భారత్ రాజీపడబోదని ప్రపంచం యావత్తు నేడు గుర్తిస్తోందని తెలిపారు ప్రధాని మోడీ.