న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ఏకంగా 100 డాలర్లు దాటడంతో కేంద్ర ప్రభుత్వం అలెర్టయింది. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా భారీగా చమురును ఎగుమతి చేసే దేశాల్లో ఒకటి. దీనిపై మరిన్ని ఆంక్షలు విధిస్తే ఆయిల్ రేట్లు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుత ధరలు ఏడేళ్ల హైకి చేరుకున్నాయి. దీంతో చమురు ధరలపై చర్చించడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గురువారం సమావేశమవుతానని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తెలిపారు. యుద్ధం, చమురు ధరల పెరుగుదల వల్ల ఏర్పడే సమస్యలపై వీరిద్దరూ మాట్లాడుకుంటారని తెలుస్తోంది. ధరలను అదుపు చేయడానికి పెట్రో ప్రొడక్టులపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ ఏ మేరకు తగ్గించవచ్చో పరిశీలించాలని పీఎం ఆఫీసు ఫైనాన్స్ మినిస్ట్రీకి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఫైనాన్స్ మినిస్ట్రీ పన్నుల తగ్గింపుపై కసరత్తు మొదలుపెట్టిందని ఈ సంగతి తెలిసిన వాళ్లు చెప్పారు. చమురు ధరల పెరుగుదల మనకు కచ్చితంగా సవాలేనని మంత్రి నిర్మల బుధవారమే మీడియాతో అన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా గత ఏడాది నవంబరులో డీజిల్పై రూ.10, పెట్రోలుపై రూ.ఐదు చొప్పున ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఈ తరువాత నుంచి ధరల్లో ఎటువంటి మార్పులూ కనిపించడం లేదు. అప్పటికే ధరలు ఎక్కువ కావడంతో ఎక్సైజ్ డ్యూటీలో కోత పెట్టారు. ఈ నిర్ణయం తరువాత కూడా చమురు ధరలు మరింత పెరిగి ఇప్పుడు తారస్థాయికి చేరాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. అయితే యుద్ధం మరింత పెరిగినప్పటికీ, ఇండియాకు చమురు సప్లైకి మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని ఆయిల్ మినిస్ట్రీకి చెందిన సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. యుద్ధం కారణంగా సప్లై లైన్లు ఏవీ దెబ్బతినలేదని, మార్కెట్లో తగినంత సప్లై ఉందని చెప్పారు. మనకు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, నార్త్ అమెరికా నుంచి క్రూడాయిల్ వస్తుందని, ఆ ప్రాంతాలన్నీ సేఫ్గానే ఉన్నాయని ఆయన వివరించారు.
పెట్రో ధరలపై పీఎం, ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్
- బిజినెస్
- February 25, 2022
లేటెస్ట్
- తెలంగాణలో కరెంట్ కోతల్లేవ్..నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం : భట్టి విక్రమార్క
- ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి : పంతకాని సమ్మయ్య
- ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని ధర్నా
- రైస్ మిల్లో అధికారుల తనిఖీలు
- పతంగ్ మూవీ టీజర్ రిలీజ్
- సర్కారు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి
- పూజా కార్యక్రమాలతో సర్పంచ్ చిత్రం ప్రారంభం
- హైదరాబాద్లో రూ.23కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు