
జనగామ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని, ఈ పథకానికి జనగామ జిల్లా ఎంపిక అయ్యిందని జనగామ కలెక్టర్రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. కృషి యోజన పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి శుక్రవారం కలెక్టరేట్ లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, మత్స్య, కోఆపరేటివ్ తదితర శాఖల అధికారులతో గూగుల్మీటింగ్నిర్వహించి ఆదేశాలను జారీ చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పీఎండీడీకేవై పథకం దోహదపడుతుందన్నారు.
వచ్చే 6 సంవత్సరాల వరకు అమలయ్యే ఈ పథకం లో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టే వివిధ రకాల కార్యకలాపాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను రూపొందిస్తున్నామన్నారు. నేడు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు, రైతులకు, స్వయం సహాయక సభ్యులకు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగు పర్చేందుకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.