- నేను విదేశీ పర్యటనలో ఉన్నా మనసంతా ఇక్కడే ఉంది
- అనుక్షణం ఆసక్తిగా ఎదురు చూశా
- కష్టానికి తగిన ఫలితం లభించింది
- భారత్ కీర్తి విశ్వవ్యాపితమైంది
- సైంటిస్టుల ధైర్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్: ప్రధాని
దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ లో ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రయాన్3 సక్సెస్ అయిన ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. మూన్పై ల్యాండర్ దిగిన ప్రాంతానికి 'శివ శక్తి' గా నామకరణం చేశారు. చంద్రయాన్ 2 వెళ్లిన చోటుకు తిరంగా పాయింట్ గా ఆయన నామకరణం చేశారు. చంద్రయాన్ 3 సక్సెస్లో నారీ శక్తి ఎంతో ఉందని కొనియాడారు.
ఆగస్టు 26 ఆయన బెంగళూరులోని ఇస్రో సెంటర్కి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించారు మోదీ. చంద్రయాన్ 3 సక్సెస్ కావడానికి కారణమైన సైంటిస్టులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ప్రపంచానికి వెలుగులు అందించే శక్తి భారత్కి ఉందని అన్నారు. తాను సౌతాఫ్రికాలో ఉన్నా మనసంతా ఇండియాలోనే ఉందని చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగం జరుగుతున్నటి నుంచి ప్రతిక్షణం ఆసక్తిగా గమనించినట్లు చెప్పారు.
సైంటిస్టుల కష్టానికి, శ్రమకు, అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. విక్రమ్ ల్యాడర్, ప్రగ్యాన్రోవర్ విరోచిత పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. భారత్ సైంటిఫిక్స్ఫూర్తికి, టెక్నాలజీకి ఈ ప్రయోగం అద్దంపట్టిందని స్పష్టం చేశారు. ఈ విజయం మానవాళికి ఉపయోగపడేదని రానున్న రోజుల్లో భారత్ వైజ్ఞానిక రంగంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రీస్పర్యటన అనంతరం ఆయన నేరుగా బెంగళూరుకు చేరుకుని ఇస్రో సెంటర్కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం ఇస్రో చీఫ్, డైరెక్టర్లను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం చేశారు.
అంతకు ముందు రోవర్ చంద్రుడిపై ల్యాండ్ అయిన దృశ్యాలను సైంటిస్టులు చూపించి వివరించారు. చంద్రుడిపై రోవర్ దిగిన దృశ్యాల తాలూకు ఫొటోలను మోదీకి అందించారు.