పీవీకి ప్రధాని మోడీ నివాళి

పీవీకి ప్రధాని మోడీ నివాళి

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు పీవీ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపారని మోడీ కొనియాడారు. విద్యావేత్తగా.. సమర్ధవంతమైన పాలకుడిగా దేశ ప్రజల గుండెల్లో పీవీ నిలిచిపోతారని అన్నారు. ఇందుకు గాను మోడీ ట్వీట్ చేశారు.

రాజీవ్ గాంధీ హత్య తరువాత.. తొమ్మిదవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ అస్తవ్యస్తమైన పాలనను చక్కపెడుతూనే దేశ ఆర్థిక పరిస్థితులకు ఊపిరులూదారు. 1991 జూన్‌లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ 1996 మే వరకూ అధికారంలో కొనసాగారు.