
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు మొబైల్అప్లికేషన్ను డౌన్లోడ్చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజల్ని కోరారు. ‘కరోనాపై దేశం చేస్తున్న పోరాటంలో ఇదొక ముఖ్యమైన అంశం. టెక్నాలజీని ఉపయోగించుకుందాం. కీలకమైన సమాచారాన్ని అందించడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది ఉపయోగిస్తే దీని ప్రభావం మరింత పెరుగుతుంది’ అని బుధవారం ట్విట్టర్లో చెప్పారు.
ఈ అప్లికేషన్ను ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో లింక్లను షేర్ చేశారు. ఈనెల 2వ తేదీన ఈ అప్లికేషన్ను ప్రభుత్వం ప్రారంభించింది. కరోనాబారిన పడే ప్రమాదాన్ని అంచనా వేసేందుకు, వైరస్సోకిన వ్యక్తికి దూరంగా ఉండేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.