బీజేపీకే మళ్లీ అధికారం…మోడీ ప్రధాని కారు

బీజేపీకే మళ్లీ అధికారం…మోడీ ప్రధాని కారు

కేంద్రంలో మళ్లీ బీజేపీ నే అధికారంలోకి వస్తుందని… అయితే మోడీ మాత్రం మళ్లీ ప్రధాని కారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ జోస్యం చెప్పారు. బీజేపీకి సొంతంగా మెజారీటీ రాదని, మిగతా మిత్ర పక్ష పార్టీలను కలుపుకుని… అతిపెద్ద పార్టీగా పార్టీ అవతరిస్తుందని ఆయన చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడిన శరద్ పవార్… ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న చాలా సీట్లను బీజేపీ కోల్పోతుందన్నారు. అయితే దేశంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందన్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించే పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కానీ ప్రధానిగా మోడీని ఎన్నుకునే అవకాశం ఉండదన్నారు. మిత్ర పక్షాల డిమాండ్‌కు తలొగ్గాల్సి ఉంటుందని… ఎన్నికల తర్వాత మనందరం కొత్త ప్రధానిని చూస్తామని.. మోడీకి మరో అవకాశం లేదన్నారు పవార్‌.