సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. అలాగే కేసీఆర్కు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మోడీ ఆకాంక్షిస్తూ మోడీ ట్వీట్ చేశారు. అంతేగాకుండా కేసీఆర్ కు ఫోన్ చేసి కూడా విషెస్ చెప్పారు. గత కొన్ని రోజులుగా బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటలయుద్దం నడుస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో కేసీఆర్ కనీసం ఆయనను కలవలేదు. దాంతో ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎం కలవకపోవడంపై పెద్ద దుమారమే రేగింది. అప్పటినుంచి బీజేపీ నేతలకు, టీఆర్ఎస్ నాయకులకు రోజుకో విషయం మీద వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా కూడా ఈ తరుణంలో కేసీఆర్కు మోడీ విష్ చేయడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.
Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022