సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ బీజేపీ నినాదం: మోడీ

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ బీజేపీ నినాదం: మోడీ

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ బీజేపీ నినాదం అన్నారు ప్రధాని మోడీ. తాను ప్రధానినే అయినా బీజేపీ కార్యకర్తనే అన్నారు. వారణాసిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలను కొన్ని రాష్ట్రాల్లో టార్గెట్ చేసి హత్యలు చేస్తున్నారన్నారు. ప్రజల హృదయాలను గెలిచి గతంలో తాము రాష్ట్రాలను విభజించామని..ఏపీ, తెలంగాణ విభజించిన వారు మాత్రం వారి మధ్య ద్వేషాన్ని పెంచారన్నారు. దేశ రాజకీయాలకు యూపీ దశ దిశ చూపిస్తోందన్నారు మోడీ. కేదార్ నాథ్, కాశీ పర్యటనలు తనకు శక్తినిస్తాయన్నారు మోడీ.