ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ : భారత్ బయోటెక్ ప్రతినిధులతో కొనసాగుతున్న చర్చ

ప్రధాని మోడీ  హైదరాబాద్ టూర్ : భారత్ బయోటెక్ ప్రతినిధులతో కొనసాగుతున్న చర్చ

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. మోడీ ఒకేరోజు మూడు సిటీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారత వాయుసేన ప్రత్యేక విమానంలో  శామీర్‌పేట్‌ మండలంలోని హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోడీకి ప్రభుత్వం తరుపున సీఎస్ సోమేష్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలోని జెనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ప్రతినిధులతో ప్రధాని మోడీ కరోనా వ్యాక్సిన్ గురించి  చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఆ చర్చలు కొనసాగుతున్నాయి.