హైదరాబాద్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

హైదరాబాద్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్,  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మోడీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్రిశాట్కు చేరుకున్నారు. ఇక్రిశాట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని కొత్త లోగో ఆవిష్కరించనున్నారు. ఇక్రిశాట్ లో 7నిమిషాల పాటు పంటలను పరిశీలించిన అనంతరం ప్రదాని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.