ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నలుగుర్ని అరెస్టు చేసిన వారణాసి పోలీసులు

వారణాసి: మనం ఏదైనా వస్తువు అమ్మాలంటే  ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడ్తం. ఏదైనా సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తువు కొనాలంటే ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తం. . కొన్ని రోజులుగా చాలామంది కేటుగాళ్లు దాంట్లో మోసాలకు పాల్పడుతున్నరు. మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోలు పెట్టి మాములు వస్తువులను కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నరు. ఇట్లనే నలుగురు కేటుగాళ్లు మరీ రెచ్చిపోయి ఏకంగా వారణాసిలోని ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పెట్టిండ్రు. జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాలో ఉన్న జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంపర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాలయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫొటో తీసి ‘ఈ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్ముతున్నం. ఎవరైనా కొంటరా?” అని ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. దాన్ని  చూసిన పోలీసులు పోస్ట్‌‌ పెట్టిన ఆ నలుగురిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

For More News..

మానవాభివృద్ధి సూచిలో మన ర్యాంక్ 131

జీహెచ్ఎంసీ అధికారుల ఐఫోన్ ఆశలకు బ్రేక్

మూడు రోజుల్లో బిల్స్​ ఇయ్యకుంటే సమ్మెకు సై