పీఎన్‌‌‌‌‌‌‌‌బీ మెట్‌‌‌‌‌‌‌‌ లైఫ్ నుంచి లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్

పీఎన్‌‌‌‌‌‌‌‌బీ మెట్‌‌‌‌‌‌‌‌ లైఫ్ నుంచి లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్

హైదరాబాద్​, వెలుగు:  బాలికలకు సురక్షిత ఆర్థిక భవిష్యత్తును అందించడానికి పీఎన్‌‌‌‌‌‌‌‌బీ మెట్‌‌‌‌‌‌‌‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సహకారంతో సుకన్య సమృద్ధి సురక్షా యోజన (ఎస్​ఎస్​ఎస్​వై) పేరుతో గ్రూప్ టర్మ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేసింది.  రూ.25 వేల నుంచి రూ.1.50 లక్షల మధ్య పేమెంట్​ఆప్షన్స్​ఉంటాయి.  

తల్లి/తండ్రి మరణిస్తే ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌వై ఖాతాకు మిగిలిన వార్షిక చెల్లింపులు పీఎన్‌‌‌‌‌‌‌‌బీ మెట్‌‌‌‌‌‌‌‌లైఫ్ ద్వారా జరుగుతాయి.  18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల తల్లిదండ్రులు ఈ పాలసీని తీసుకోవచ్చు. 64 సంవత్సరాల వయస్సు వరకు కవరేజ్ కొనసాగుతుంది.