ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి : పోచారం

ఇచ్చిన 420 హామీలు  ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి : పోచారం

ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్కే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నెల రోజుల్లో పరిపాలన గాలికి వదిలేశారని హైదరాబాద్ తెలంగాణ భవన్లో విమర్శించారు. ఉన్న పథకాలు వదిలేస్తున్నారని ఆరోపించారు. రైతుబంధుకు అతి, గతి లేదన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఊసే ఎత్తడం లేదన్నారు పోచారం. పెట్టుబడి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్న నేతలు.... ఇంత వరకు ధాన్యం కొనుగోలు చెయ్యలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు పోచారం.