పోచారం నయా రికార్డు

పోచారం నయా రికార్డు

రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్​గా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడిగా పోచారం శ్రీనివాస్​రెడ్డి చరిత్రలో నిలిచారు. 2014లో స్పీకర్​గా పని చేసిన మధుసూదనాచారి 2018 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఏపీ స్పీకర్​గా పని చేసిన కోడెల శివ ప్రసాద్​రావు 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 నుంచి స్పీకర్ గా పని చేస్తున్న పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.