
కేసీఆర్ అంటే వ్యక్తి కాదు శక్తి అని అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏడున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో అన్ని రంగాలలో ముందున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి సహాయం పొందుతుందన్నారు. అన్ని వర్గాలకు సహాయం అందుతుందన్నారు. తెలంగాణలో అభివృద్ధి చూసి వేరే రాష్ట్రాలలో అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణతో పాటు దేశ విదేశాలలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాలను చూసి పక్క రాష్ట్రం వాళ్ళు ఈర్ష్య పడుతున్నారన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడి కోసం దేశంలో ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు పోచారం.