పీఓకేను వెనక్కి తీసుకోవాలి.. భారత్ అనే ఇంటిలో అది ఓ రూమ్: మోహన్ భగవత్

పీఓకేను వెనక్కి తీసుకోవాలి.. భారత్ అనే ఇంటిలో అది ఓ రూమ్: మోహన్ భగవత్

సత్నా: పాక్​ ఆక్యుపైడ్​ కాశ్మీర్​ (పీఓకే) భారత్​లో భాగమేనని, దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయులంతా కోరుతున్నారని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ అన్నారు. ‘‘మనదంతా ఒకటే ఇల్లు. ఆ ఇంటిలో ఒక గది అక్కడ(పీఓకే)లో ఉంది. దానిలోకి ఎవరో వచ్చి చొరబడ్డారు. ఎప్పటికైనా ఆ గది మనదే. మనకు రావాల్సిందే” అని ఆయన పేర్కొన్నారు. 

మధ్యప్రదేశ్​లోని సత్నాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్​ భగవత్​ మాట్లాడారు. భారతీయులదంతా ఒకే భాష అని.. దాని పేరు హృదయ భాష అని పేర్కొన్నారు. భారతదేశమనే ఇంటిలో ఒక రూమ్​ పీఓకే అని.. దానిలో అపరిచితులు వచ్చి చేరారని, వాళ్లు ఖాళీ చేయాల్సిందేనని తెలిపారు. 

కాగా, పీఓకేలో పాకిస్తాన్​ పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ మోహన్​ భగవత్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాలుగు రోజుల కింద ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్​ భదత్రా సామర్థ్యాన్ని మరింత 
పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.