ములుగు, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20ఏండ్ల జైలు శిక్ష, రూ. 6 వేల జరిమానా విధిస్తూ ములుగు జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్ వీపీ సూర్యచంద్రకళ శుక్రవారం తీర్చు ఇచ్చారు. వివరాలను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెల్లడించారు.
ములుగు మున్సిపాలిటీ పరిధి బండారుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఏల్పుల రవితేజ.. అదే గ్రామానికి చెందిన బాలికను వేధిస్తుండేవాడు. 2020లో బాధితురాలి తండ్రి పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. కేసు దర్యాప్తు అధికారులు డీఎస్పీ కిషోర్, సీఐ దేవేందర్రెడ్డి, ఎస్ఐలు ఫణి, లక్ష్మణ్, సీడీవో స్రవంతిని ఎస్పీ అభినందించారు.

