భద్రాచలం, వెలుగు : పోలవరం బ్యాక్వాటర్కారణంగా భద్రాచలం పట్టణానికి కలిగే ముప్పు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర జలశక్తి సంఘం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్నిపుణుల కమిటీ గురువారం భద్రాచలంలో పర్యటించింది. తెలంగాణకు చెందిన ఇరిగేషన్ఈఈ సయ్యద్అహ్మద్, ఏపీకి చెందిన ఇరిగేషన్ ఈఈ దామోదర్, ఏఈఈ స్రవంతి టీమ్ తెలంగాణ, ఏపీ బార్డర్ లోని భద్రాచలం, ఎటపాక మండలాల్లో పర్యటించి గోదావరి కరకట్టల పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కరకట్టల స్లూయిజ్ల సామర్థ్యాన్ని భద్రాచలం ఇరిగేషన్ ఈఈ సయ్యద్అహ్మద్ వివరించారు. కరకట్టను బలోపేతం చేయడంతో పాటు స్లూయిజ్ ల వద్ద అత్యంత శక్తివంతమైన మోటార్లు ఏర్పాటు చేయడం, పట్టణంలోనికి ప్రవేశించే నీటిని ఎప్పటికప్పుడు తోడేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చేపట్టాల్సిన పనులపై రిపోర్ట్ ను తయారు చేసి సీడబ్ల్యూసీకి పంపించనున్నట్లు నిపుణుల కమిటీ పేర్కొంది. అంతకు ముందు ఐటీసీ పీఎస్పీడీ ఫ్యాక్టరీ గెస్ట్ హౌజ్ లో ఇంజినీరింగ్నిపుణుల కమిటీ భేటీ అయ్యింది.
