
హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆఫీసును హైదరాబాద్నుంచి రాజమండ్రికి తరలించనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్కు పీపీఏ మెంబర్ సెక్రటరీ రఘురామ్ మంగళవారం లేఖ రాశారు. రాజమండ్రిలోని ఏఎంజీ కాలేజీ ఎదురుగా 11,550 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్, పిట్టలవాయి చెరువు సమీపంలోని 7 వేల స్క్వేర్ ఫీట్ల విష్ణు నివాసం భవనం, పిడింగొయ్య వద్ద గల 12 వేల చదరపు అడుగుల భవనాలల్లో ఏది అనుకూలంగా ఉందో పరిశీలించి ఫైనల్చేయాలని తెలిపారు.