హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఇటీవల నిర్వహించిన 17వ మీటింగ్ కు సంబంధించిన మినిట్స్ను సవరించింది. వివిధ అంశాలపై నవంబర్ 7న హైదరాబాద్లో ఏపీ, తెలంగాణ సహా సభ్య రాష్ట్రాలతో మీటింగ్ నిర్వహించింది. పోలవరం ప్రాజెక్టును యాక్చువల్ కంపొనెంట్ను మించి విస్తరిస్తున్నారని మన అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం కుడి కాల్వ కెపాసిటీని 12,250 క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని, అది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
కొద్దిరోజుల క్రితం రిలీజ్చేసిన మీటింగ్మినిట్స్లో మాత్రం తెలంగాణ అభ్యంతరాలను పీపీఏ చేర్చలేదు. వెంటనే మినిట్స్లో తమ అభ్యంతరాలనూ చేర్చాలని కోరుతూ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా.. పీపీఏకు లేఖ రాశారు. దీంతో తాజాగా పీపీఏ ఆ వ్యాఖ్యలనూ మినిట్స్లో చేర్చి విడుదల చేసింది.

