
- గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహకారంతో స్మగ్లింగ్
- ముందస్తు సమాచారంతో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్యాసింజర్దుబాయ్నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్నుంచి మస్కట్మీదుగా శంషాబాద్ఎయిర్పోర్టుకు చేరుకున్న ఫ్లైట్లో భారీగా బంగారం ఉందని డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. తనిఖీలు చేసి ఓ ప్యాసింజర్వద్ద 3.5 కిలోల గోల్డ్బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అతను ఇంటర్నేషనల్ప్యాసింజర్ల గేట్సమీపంలో పనిచేస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహకారంతో గోల్డ్స్మగ్లింగ్చేస్తున్నట్లు గుర్తించారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సాయంతో గోల్డ్ను పార్కింగ్ ఏరియా దాకా తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు. మొత్తం మూడు ప్యాకెట్లలో 30 గోల్డ్బిస్కెట్లను గుర్తించగా, ఒక్కదానిలో 10 గోల్డ్బిస్కెట్లు ఉన్నాయి. మొత్తం బంగారం విలువ రూ.3కోట్ల45లక్షల79వేల300 ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడితోపాటు ఇద్దరు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేశారు.