నిజాముద్దీన్ లో కరోనా కలకలం : తెలంగాణ నుంచి భారీ ఎత్తున పాల్గొన్నట్లు అనుమానం

నిజాముద్దీన్ లో కరోనా కలకలం : తెలంగాణ నుంచి భారీ ఎత్తున పాల్గొన్నట్లు అనుమానం

ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు .. ఈ నెల 13నుంచి 15వ తేదీ మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో మతపరమైన ప్రార్ధనల్లో పాల్గొన్న కొందరికి కరోనా సోకిందని, వారిలో తెలంగాణ కు చెందిన వారు కూడా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అధికారులు నిజాముద్దీన్ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికుల్ని పోలీసులు కరోనా వైరస్ టెస్ట్ ల నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్చి 10న జరిగిన మతపరమైన ప్రార్ధనల్లో పాల్గొనేందుకు మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌ తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు హాజరయ్యారు.

ప్రార్ధనల్లో పాల్గొన్న ఇండోనేషియా వాసులు

నిజాముద్దీన్ మతపరమైన ప్రార్ధనల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల్లో ఈ ప్రార్ధనలకు హాజరైనవారు ఉన్నారు. కరీంనగర్ లో ఇండోనేషియా వాసులు కూడా ఈ ప్రార్ధనల్లో పాల్గొన్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు.

ప్రార్ధనా కార్యక్రమాలపై ఎఫ్ ఐఆర్ నమోదు

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. అయితే ఈ లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తూ మతపరమైన కార్యక్రమాలు చేపట్టినందుకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ నుంచి భారీ ఎత్తున హాజరు

నిజాముద్దీన్  ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్ధనల్లో హైదరాబాద్ – 186, అదిలాబాద్ -10, నిజామాబాద్-18,మెదక్ – 26,రంగారెడ్డి – 15, మహబూబ్ నగర్ – 25, నల్గొండ – 21, ఖమ్మం – 15, వరంగల్  25, కరీంనగర్ 17, భైంసా – 11, నిర్మల్ – 11 మంది హాజరైనట్లు ప్రభుత్వ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ ప్రార్ధనల్లో ఎంతమంది ఎక్కడి నుంచి పాల్గొన్నారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.