
పద్మారావునగర్, వెలుగు : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వారాసిగూడ ఇన్స్పెక్టర్ఆర్.సైదులు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ఫ్లాగ్ మార్చ్నిర్వహించారు. చిలకలగూడ ఇన్ స్పెక్టర్అనుదీప్, ఎస్ఐ లు టి.సుధాకర్, ఆర్. ప్రకాశ్రెడ్డి, కిషోర్, సీఐఎస్ఎఫ్కు చెందిన 62 మంది జవాన్లు పార్సీగుట్ట క్రాస్ రోడ్డు నుంచి అశోక్ నగర్, వైఎస్ ఆర్ పార్క్ , రాంనగర్
లక్ష్మమ్మ పార్కు లేన్, రాంనగర్ మెయిన్ రోడ్డు, పార్సీ గుట్ట మెయిన్ రోడ్డు మార్చ్ తీశారు. లోక్ సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి రాజకీయ నేతలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.