హైదరాబాద్ : లోటస్ పాండ్ లోని వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. TSPSC పేపర్ లీకేజీలో ఇవాళ ఇందిరాపార్క్ వద్దకు దర్నాకు పిలుపునిచ్చారు షర్మిల. అయితే ట్రాఫిక్ సమస్యలు వస్తాయనే కారణంతో అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దర్నాకు అనుమతి ఇవ్వకున్న ఇందిరాపార్క్ కు వెళ్తామని పార్టీ నేతలు చెప్పడంతో పోలీసులు షర్మిల ఇంటివద్ద భారీగా మోహరించారు. దర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై షర్మిల కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. TSPSC పేపర్ లీకేజీలో పేపర్ లీకేజీలో నిందితులపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.