యాదాద్రిలో 438 మందికి పోలీసు ఉద్యోగాలు

యాదాద్రిలో 438 మందికి పోలీసు ఉద్యోగాలు
  • నియామక పత్రాలు అందించనున్న సీఎం

యాదాద్రి, వెలుగుపోలీసు ఉద్యోగాల్లో యాదాద్రి జిల్లా మార్క్​ కనపడనుంది. పోలీసు డిపార్ట్​మెంట్​లోని వివిధ విభాగాలకు స్టేట్​ లెవల్లో 15,750 మంది ఎంపిక కాగా వీరిలో యాదాద్రి జిల్లా నుంచి 438 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్​రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందించనున్నారు.

మార్చి 2022లో అప్పటి ప్రభుత్వం పోలీసు నియామకాలకు నోటిఫికేషన్​ జారీ చేసిన సంగతి తెలిసిందే. 4 అక్టోబర్​ 2023 నాటికి పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయింది. అయితే కోర్టులో కేసు కారణంగా ఈ ప్రక్రియ పెండింగ్​లో పడింది. సెలక్షన్​ ప్రాసెస్​ పూర్తైన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. పైగా జీవో నెంబర్​ 46 రద్దు చేయడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం వీరందరికీ నియామక పత్రాలు అందించాలని నిర్ణయం తీసుకుంది.

ALSO READ :- టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ తాహిర్

దీంతో జిల్లా నుంచి పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్, అగ్ని మాపక, రవాణా, జైళ్లు శాఖలకు ఎంపికైన 438 మందికి సీఎం రేవంత్​రెడ్డి నియామక పత్రాలు అందిస్తారని కలెక్టర్​ హనుమంతు జెండగే తెలిపారు.  వీరందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చామని, బుధవారం ఉదయం  పది బస్సుల్లో హైదరాబాద్‌‌లోని ఎల్బీ స్టేడియానికి పంపిస్తామని చెప్పారు.