జాఫర్ పహిల్వాన్ ఇంట్లో పోలీసుల తనిఖీలు

జాఫర్ పహిల్వాన్ ఇంట్లో పోలీసుల తనిఖీలు

ఓల్డ్​సిటీ వెలుగు :  రెయిన్​ బజార్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని చోటపూల్​ వద్ద ఇటీవల జరిగిన జునైద్​ హత్య కేసుతో పాటు 40 క్రిమినల్ కేసుల్లో  ఉన్న రౌడీ షీటర్​ జాఫర్​ పహిల్వాన్​ ఇంట్లో పోలీసులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేశారు.    అక్రమ ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  సౌత్​ జోన్​ డీసీపీ కిరణ్​ ఖరే ప్రభాకర్​​ రెయిన్​ బజార్​ పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్​ సీహెచ్​ నేతాజీ,  మీర్​ చౌక్​ సీఐ సురేష్​ కుమార్​, భవాని నగర్​ పోలీస్​ స్టేషన్​ సీఐ బాలస్వామిలతో పాటు 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

 ఈ సోదాల్లో  కత్తులు, అనుమానిత  ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో మాజీ రౌడీ షీటర్​ సయిద్​ పహిల్వాన్​, సులేమాన్​ పహిల్వాన్​ నిందితులపై ఆయుధాల చట్టం కింద రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసినట్లు కిరణ్​ ఖరే ప్రభాకర్​​తెలిపారు.  జునైద్​ హత్య కేసులో ఉన్న నిందితులను గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు  గాలిస్తున్నారు పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.