ఇసుక తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

ఇసుక తయారీ కేంద్రాలపై  పోలీసుల దాడులు

జడ్చర్ల, వెలుగు: ఉదండాపూర్​ నుంచి జడ్చర్లకు ఫిల్టర్​ ఇసుకను తరలిస్తున్న 10 టిప్పర్లను జడ్చర్ల పోలీ సులు పట్టుకున్నారు. ఉదండాపూర్​ రిజ ర్వాయర్​లో ఫిల్టర్  ఇసుక తయారు చేస్తున్నారనే సమాచారంతో ఇసుక తయారీ కేంద్రాలపై పట్టణ సీఐ ఆదిరెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఫిల్టర్  ఇసుక తరలిస్తున్న 10 టిప్పర్లను పట్టుకొని స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేశారు.

ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై సీరియస్​గా ఉండాలని ఆదేశించడంతో, రెండు రోజుల కింద అల్వాన్​పల్లి శివవారులోని దుందుభి వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణ చేస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్​ నమోదు చేస్తామని హెచ్చరించారు.