దొంగలముఠా అరెస్ట్: 11 లక్షల ఆభరణాల స్వాధీనం

దొంగలముఠా అరెస్ట్: 11 లక్షల ఆభరణాల స్వాధీనం

మంచిర్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. 11 లక్షల 80 వేల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరిపై గతంలో 21 కేసులున్నాయి. ఈ ముఠా రాష్ట్రంలోని వరంగల్, జగిత్యాల, కరీంనగర్ తో పాటు ఇతర జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు రామగుండం కమిషనర్ తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టినట్లు తెలిపారు.