కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అర్వింద్ ఇంటిపై దాడి : పోలీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అర్వింద్ ఇంటిపై దాడి : పోలీసులు

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అర్వింద్ ఇంటిపై దాడి జరిగిందని పేర్కొన్నారు. కవితపై పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి..ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్లే దాడి జరిగిందని రిపోర్టులో ఉంది. అర్వింద్ ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్డీ స్టూడెంట్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.

అర్వింద్ ఇంటి వద్ద బందోబస్త్ ఎక్కువగా లేకపోవడంతో నిందితులు దాడికి తెగబడ్డట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. ఈ ఘటనలో 2 సిమెంట్ రాళ్ళు, 2 కర్రలు, టీఆర్ఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న పూజ సామగ్రి, హాల్, కారుపై దాడి చేశారని రిపోర్టులో ఉంది. అయితే రిమాండ్ రిపోర్టులో జాగృతి కన్వీనర్  రాజీవ్ సాగర్, జాగృతి నవీనాచారి పేర్లు లేవు.