క్యాతనపల్లి ఘటనలో నిందితుల కోసం గాలింపు.. ఇప్పటికే నలుగురి రిమాండ్‌

క్యాతనపల్లి ఘటనలో నిందితుల కోసం గాలింపు.. ఇప్పటికే నలుగురి రిమాండ్‌
  • మిగిలిన వారిని పట్టుకునేందుకు స్పెషల్‌ టీం ఏర్పాటు

కోల్‌బెల్ట్‌, వెలుగు : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల సందర్భంగా ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్​వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌పై రాళ్ల దాడి కేసులో బీఆర్ఎస్‌, సీపీఐకి చెందిన 20 మందిపై రామకృష్ణాపూర్​ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా ఘటనకు కారకులైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, దొమకొండ అనిల్, రామిడి లక్ష్మికాంత్‌ను బుధవారం రిమాండ్‌కు తరలించారు మిగిలిన వారి కోసం ప్రత్యేకటీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నామని రామకృష్ణాపూర్​ఎస్సై జె.శ్రీధర్‌ గురువారం తెలిపారు.