గులాబీ కండువా కప్పుకోకుంటే  కష్టాలు తప్పవ్

గులాబీ కండువా కప్పుకోకుంటే  కష్టాలు తప్పవ్

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్.. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిల్లో బలమైన కాంగ్రెస్, బీజేపీ నేతలను బీఆర్ఎస్​లో చేర్పించే బాధ్యత పోలీసులకు అప్పగించిందనే ప్రచారం జరుగుతున్నది. ఆయా ఠాణాల పరిధిలో రెండు పార్టీల లీడర్లపై ఉన్న పెండింగ్ కేసులను బయటికి తీయడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారు.

లీడర్లను పిలిపించి అధికార పార్టీలోకి వెళ్తావా.. చిక్కులు ఎదుర్కొంటావా.. అని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారట. మల్కాజిగిరిలో బీఆర్ఎస్​ను వీడి మైనంపల్లి వెంట వెళ్లేందుకు సిద్ధపడిన లీడర్లను ఇలాగే బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. హెచ్చరికలను పట్టించుకోని వారిని పోలీసులు వేధిస్తున్నట్టు మైనంపల్లి బహిరంగంగానే విమర్శలు చేశారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల టైమ్​లోనూ ఈటల వెంట ఉన్నోళ్లను కేసులు పెడ్తామని చెప్పి దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ పాత కేసుల చిట్టా పద్దులు విప్పుతూ ఏంటి సంగతి అంటూ ప్రశ్నిస్తున్నారు. కేసులు ఎదుర్కోవడం ఎందుకు అనే హైరానాతో కొందరు కారెక్కుతున్నారు. వినని వాళ్లను రోజూ ఠాణాకు పిలిపించి కూర్చోబెడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని లోకల్ లీడర్లు హైరానా చెందుతున్నారు.